Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు గోదావరిలో పశువులను తింటున్న వింత జంతువు

Webdunia
సోమవారం, 25 మే 2020 (15:39 IST)
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరులో వింత జంతువు సంచారం కలకలం రేపుతుంది. రోజు రాత్రి సమయంలో పొలాల్లో ఉన్న పశువులను చంపేస్తుంది. 
ఇప్పటివరకు 20కి పైగా పశువులు మృతి చెందడంతో నిద్రహారాలు మాని రైతులు 
రాత్రి అంతా పొలాల్లోనే గడుపుతున్నారు.
 
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం పరిధిలో వింత జంతువు సంచారం కలకలం రేపుతుంది. రోజూ రాత్రి వేళల్లో  లేగదూడల్ని చంపేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పశువులను పొట్టన పెట్టుకుంది. దీనితో పాడి రైతుల్లో  భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వింత జంతువుని ఎవరూ చూడలేదు. పాడి పశువులు, లేగదూడలను చంపి తిని వేయడంతో, ఇది చిరుతా లేక ఇతర జంతువులా అన్న అనుమానం ఉంది.
 
మూకుమ్మడిగా నక్కలు దాడి చేసి ఉండవచ్చనే అనుమానం కలుగుతుంది. పెనికేరు, నవాబుపేట, జొన్నాడ ఈ ప్రాంతాల మధ్యలోనే రాత్రి వేళల్లో సంచరిస్తుంది. ఇటీవల పెనికేరు గ్రామానికి చెందిన కోన శేషయ్య, కోటిపల్లి వెంకన్న, సిరిపాదం వెంకటరమణకు చెందిన లేగదూడలను చంపేసింది. అలాగే జొన్నాడ గ్రామానికి చెందిన రైతు దూడను గాయపరచి దూడ తోకను తినేసింది.
 
ఇలా లేగదూడలను చంపేస్తున్న జంతువు ఏమిటన్నది ఇంతవరకు అంతుచిక్కలేదు. కొందరు చిరుత అని మరికొందరు వింత జంతువని, ఇంకొందరు నక్కల గుంపు అని చెబుతున్నారు. దీంతో రైతులంతా రాత్రి సమయంలో కంటమీద కునుకు లేకుండా మకాంల వద్ద కాపలా కాస్తున్నరు పాడి రైతులు. దీనితో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
వింత జంతువును పట్టుకుని పశువులను కాపాడాలని వేడుకుంటున్నారు. ఈ జంతువు బారిన పడి అనేక లేగదూడలు బలవుతున్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని పెనికేరు, నవాబుపేట, జొన్నాడ గ్రామాల పాడి రైతులు కోరుతున్నారు. ప్రతిరోజు లేగదూడలను చంపేస్తున్న సంఘటనలు వెనుక దాగివున్న రహస్యాన్ని పరిష్కరించాలని, మృతి చెందిన లేగదూడల యజమానులకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments