Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అకారణంగా లాఠీలకు పనిచెప్తే సస్పెండ్ చేస్తాం : ఏపీ డీజీపీ వార్నింగ్

అకారణంగా లాఠీలకు పనిచెప్తే సస్పెండ్ చేస్తాం : ఏపీ డీజీపీ వార్నింగ్
, శుక్రవారం, 27 మార్చి 2020 (11:26 IST)
లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరకుల కోసం గృహాల నుంచి బయటకు వచ్చే వారిపై అకారణంగా లాఠీ ఝుళిపించే పోలీసులకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ తీవ్ర హెచ్చరిక చేశారు. లాక్‌డౌన్ సందర్భంగా ఎవరైనా ఇళ్ళ నుంచి బయటకు వస్తే ముందుగా వారిని హెచ్చరించాలనీ, అప్పటికీ మాట వినకపోతే లాఠీలకు పని చెప్పాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పెరవలి గ్రామానికి చెందిన ఓ యువకుడిపై స్థానిక ఎస్ఐ అతిగా ప్రవర్తించాడు. ఇంటి నుంచి బయటకు వచ్చాడన్న కోపంతో విచక్షణారహితంగా చితకబాదాడు. త‌ప్ప‌యింద‌ని బ‌తిమాల‌డానికి వ‌చ్చిన అత‌ని తండ్రిని కూడా తీవ్రంగా కొట్టాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయం డీజీపీ గౌతం సవాంగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. 
 
యువ‌కుడిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసిన పెరవలి ఎస్ఐ కిరమణ్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా ఎవ‌రైనా ఇళ్ళ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే ముందుగా హెచ్చ‌రించాల‌ని, అయినా మాట విన‌క‌పోతే అప్పుడు లాఠీచార్జి చేయాల‌ని డీజీపీ సూచించారు. అత్య‌వ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చేవారిని ఇబ్బంది పెట్టొద్ద‌ని చెప్పారు. బ‌య‌ట ఎవ‌రు క‌న‌ప‌డినా అకార‌ణంగా లాఠీల‌కు ప‌నిచెప్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని పోలీసులకు హెచ్చ‌రిక చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొగరాయుళ్ళకు కరోనా వైరస్‌తో పెనుముప్పు?