Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తూగో వాసికి కరోనా వైరస్... వణికిపోయిన గ్రామస్థులు...

తూగో వాసికి కరోనా వైరస్... వణికిపోయిన గ్రామస్థులు...
, బుధవారం, 4 మార్చి 2020 (08:32 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇపుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడికి ఈ వైరస్ సోకిందన్న పుకార్లు హల్చల్ సృష్టించాయి. దీంతో స్థానిక అధికారులు పరుగులు పెట్టారు. 
 
జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడు దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అనంతరం స్వగ్రామమైన వాడపాలేనికి వెళ్లాడు. అక్కడ రెండు రోజుల పాటు జ్వరం వచ్చింది. ఇక అంతే.. గ్రామస్తులంతా అతనికి కరోనా వైరస్ సోకివుంటుందనే పుకార్లు పుట్టించారు. 
 
ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన హైదరాబాద్ అధికారులు, అతనికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో, అతడికి సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. అప్రమత్తమైన కలెక్టర్ జిల్లా అధికారులు, ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు. 
 
బాధితుడు స్వగ్రామం నుంచి తన అత్తగారి ఊరైన గోదశపాలెం వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు.  ఈ వార్త కాస్తా వెలుగులోకి రావడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, బాధితుడికి కరోనా వైరస్ సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం?: కాంగ్రెస్ అనుమానం