Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సర్కారు మద్యం షాపులు ప్రారంభం

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (12:14 IST)
నూతన నిబంధనల ప్రకారం నేటినుంచి జిల్లావ్యాప్తంగా 39 షాపుల్లో మద్యం విక్రయాలకు ఎక్సైజ్‌ అధికారులు సన్నద్ధం అయ్యారు. గుంటూరు డివిజన్‌లో 7, తెనాలి డివిజన్‌లో 20, నరసరావుపేట డివిజన్‌లో 12 షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి.

ఇకనుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు పని చేస్తాయి. ఆయా మద్యం షాపులకు పర్మిట్‌ రూమ్స్‌, లూజ్‌ సేల్స్‌ ఉండదు. అక్టోబరు 1 నుంచి మిగిలిన అన్ని షాపులు కలుపుకొని 282 షాపులలో మద్యం అమ్మకాలు జరుగనున్నాయి.

అయితే బార్ల లైసెన్సులు మాత్రం 2022 వరకు ఎటువంటి మార్పు ఉండక పోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా షాపుల నిర్వహణకు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు హెల్పర్లను ఎక్సైజ్‌శాఖ అధికారులు ఔట్‌సోర్సింగ్‌ విధానం ద్వారా తీసుకున్నారు.

ప్రస్తుతం ప్రైవేటు ఆధీనంలో ఉన్న షాపులకు పర్మిట్‌ రూమ్స్‌ ఉన్నాయి. నిబంధనల ప్రకా రం ఆ రూమ్‌లోనే మద్యం సేవించే అవకాశం ఉంది. గతంలో ఒక్కో వ్యక్తి ఆరు మద్యం బాటిళ్ళు విక్రయించే వారు. దానిని మూడు బాటిల్స్‌కు కుదించారు. ఎవరి వద్ద అయినా అంతకు మించి మద్యం బాటిల్స్‌ అధికంగా ఉంటే అతనిపై కేసు నమోదు చేస్తారు.
 
ప్రభుత్వ నూతన మద్యం పాలసీ అమల్లో భాగంగా లూజ్‌సేల్స్‌, పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు. ఎమ్మార్పీ ఉల్లంఘన పూర్తిగా నిషేధం. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మద్యం అమ్మకాలు చేపడతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments