Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సర్కారు మద్యం షాపులు ప్రారంభం

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (12:14 IST)
నూతన నిబంధనల ప్రకారం నేటినుంచి జిల్లావ్యాప్తంగా 39 షాపుల్లో మద్యం విక్రయాలకు ఎక్సైజ్‌ అధికారులు సన్నద్ధం అయ్యారు. గుంటూరు డివిజన్‌లో 7, తెనాలి డివిజన్‌లో 20, నరసరావుపేట డివిజన్‌లో 12 షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి.

ఇకనుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు పని చేస్తాయి. ఆయా మద్యం షాపులకు పర్మిట్‌ రూమ్స్‌, లూజ్‌ సేల్స్‌ ఉండదు. అక్టోబరు 1 నుంచి మిగిలిన అన్ని షాపులు కలుపుకొని 282 షాపులలో మద్యం అమ్మకాలు జరుగనున్నాయి.

అయితే బార్ల లైసెన్సులు మాత్రం 2022 వరకు ఎటువంటి మార్పు ఉండక పోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా షాపుల నిర్వహణకు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు హెల్పర్లను ఎక్సైజ్‌శాఖ అధికారులు ఔట్‌సోర్సింగ్‌ విధానం ద్వారా తీసుకున్నారు.

ప్రస్తుతం ప్రైవేటు ఆధీనంలో ఉన్న షాపులకు పర్మిట్‌ రూమ్స్‌ ఉన్నాయి. నిబంధనల ప్రకా రం ఆ రూమ్‌లోనే మద్యం సేవించే అవకాశం ఉంది. గతంలో ఒక్కో వ్యక్తి ఆరు మద్యం బాటిళ్ళు విక్రయించే వారు. దానిని మూడు బాటిల్స్‌కు కుదించారు. ఎవరి వద్ద అయినా అంతకు మించి మద్యం బాటిల్స్‌ అధికంగా ఉంటే అతనిపై కేసు నమోదు చేస్తారు.
 
ప్రభుత్వ నూతన మద్యం పాలసీ అమల్లో భాగంగా లూజ్‌సేల్స్‌, పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు. ఎమ్మార్పీ ఉల్లంఘన పూర్తిగా నిషేధం. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మద్యం అమ్మకాలు చేపడతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

మంచి సందేశాన్ని ఇచ్చే బందీని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్ : ఆదిత్య ఓం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments