Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభించండి: సీఎం జగన్

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (17:16 IST)
కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యా సంస్థలు ఇంకా తెరుచుకోని సంగతి తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయన్న సంగతి ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభించాలని తెలిపారు.
 
ఈ రోజు ఆయన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుక కిట్లను జగన్ పరిశీలించారు. ఆ సందర్భంగా సెప్టెంబరు 5 నుండి పాఠశాలలు ప్రారంభించాలని ఆ సమయానికి నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలని జగన్ చెప్పారు.
 
ప్రతి స్కూల్లో పెయింటింగ్స్ బొమ్మలు వేయాలని ఆదేశించారు. విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠశాలలు ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభానికి అన్ని చర్యలను చేపడుతున్నామని తెలిపారు. కాగా రోజూ 9 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న సందర్భంలో నెలరోజుల్లో ఈ సంఖ్య కిందికి వస్తుందా అనే సందేహాలు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments