Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభించండి: సీఎం జగన్

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (17:16 IST)
కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యా సంస్థలు ఇంకా తెరుచుకోని సంగతి తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయన్న సంగతి ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభించాలని తెలిపారు.
 
ఈ రోజు ఆయన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుక కిట్లను జగన్ పరిశీలించారు. ఆ సందర్భంగా సెప్టెంబరు 5 నుండి పాఠశాలలు ప్రారంభించాలని ఆ సమయానికి నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలని జగన్ చెప్పారు.
 
ప్రతి స్కూల్లో పెయింటింగ్స్ బొమ్మలు వేయాలని ఆదేశించారు. విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠశాలలు ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభానికి అన్ని చర్యలను చేపడుతున్నామని తెలిపారు. కాగా రోజూ 9 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న సందర్భంలో నెలరోజుల్లో ఈ సంఖ్య కిందికి వస్తుందా అనే సందేహాలు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

తర్వాతి కథనం
Show comments