Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభించండి: సీఎం జగన్

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (17:16 IST)
కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యా సంస్థలు ఇంకా తెరుచుకోని సంగతి తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయన్న సంగతి ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభించాలని తెలిపారు.
 
ఈ రోజు ఆయన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుక కిట్లను జగన్ పరిశీలించారు. ఆ సందర్భంగా సెప్టెంబరు 5 నుండి పాఠశాలలు ప్రారంభించాలని ఆ సమయానికి నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలని జగన్ చెప్పారు.
 
ప్రతి స్కూల్లో పెయింటింగ్స్ బొమ్మలు వేయాలని ఆదేశించారు. విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠశాలలు ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభానికి అన్ని చర్యలను చేపడుతున్నామని తెలిపారు. కాగా రోజూ 9 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న సందర్భంలో నెలరోజుల్లో ఈ సంఖ్య కిందికి వస్తుందా అనే సందేహాలు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments