Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లాలో దారుణం: బతికుండగానే చిన్నారిని పూడ్చి పెట్టిన తల్లి

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:24 IST)
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. బతికుండగానే ఆమె తల్లి చిన్నారిని పూడ్చి పెట్టించింది. నందిగాం మండలానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చటంతో గురువారం కాశీబుగ్గలో ఓ వైద్యుడి వద్దకు వచ్చింది. ఆమెకు ప్రస్తుతం ఏడో నెల. ఏమైందో తెలియదు గానీ.. ఆమె కోరడంతో వైద్యుడు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు.
 
ఆ తల్లి తనకు ఆడపిల్ల పుట్టిందని.. అక్కడ ఉన్న ఓ వ్యక్తికి ఆ బిడ్డను తెల్లని వస్త్రంలో చుట్టి తీసుకెళ్లి ఖననం చేయమంది. తీసుకెళ్లిన ఆ వ్యక్తి బిడ్డను ఖననం చేసే ముందు ఫొటోలు, వీడియో తీయగా అవి శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో విషయం బయటకు పొక్కింది. 
 
ఆ బిడ్డను బతికుండగానే పాతిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాశీబుగ్గ సీఐ శంకరరావును అడగ్గా.. విషయం తమ దృష్టికి రాలేదన్నారు. శిశువు తల్లి కాశీబుగ్గలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments