Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బ్రదర్‌కు తప్పిన ముప్పు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
బుధవారం, 17 జులై 2019 (14:00 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ సమయంలో చెట్టుకొనను తగలడంతో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఆయనతో పాటు ఆ విమానంలో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం రేణిగుంట విమానాశ్రయంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 6.50 నిమిషాలకు వచ్చి 7.30 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం... గంట ఆలస్యంగా వచ్చింది. ఆ తర్వాత ఈ విమానం 8.50 నిమిషాలకు బయలుదేరింది. ఈ విమానం గాల్లోకి ఎగిరిన 10 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)ను పైలట్లు కోరారు. 
 
ఏటీసీ అనుమతితో ఆ విమానం అత్యంవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఏర్పడిన సాంకేతక లోపం ఈ పరిస్థితి తలెత్తింది. విమానంలో కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డితో పాటు పలువురు ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేపైనే నిలబడిపోయింది. స్పైస్ జెట్ సిబ్బంది ట్రాక్టర్ సాయంతో ఈ విమానాన్ని పాత టెర్మినల్ బిల్డింగ్ వద్దకు తీసుకొచ్చారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని ఇంజనీర్లు, టెక్నీషియన్లు సరిచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments