Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడను ముంచెత్తిన వరదు.. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం.. రైళ్లు రద్దు

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (17:07 IST)
విజయవాడ నగరం నీట మునిగింది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదితో పాటు బుడమేర కరకట్టలకు గండ్లు పడ్డాయి. దీంతో వరద నీరు జనావాస ప్రాంతాలను ముంచెత్తాయి. ఫలితంగా విజయవాడలోని అనేక ప్రాంతాలు జనదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వర్షాలు, వరద నీరు బీభత్సం సృష్టించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇది రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. విజయవాడ పరిధిలో కూడా పలు రైళ్ళను రద్దు చేసింది. 
 
ముఖ్యంగా తిరుపతి మీదుగా వెళ్లాల్సిన అనేక రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లు తెనాలి మీదుగా దారి మళ్లించారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్, శబరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను ఐదున్నర గంటల ఆలస్యంగా నడుపుతున్నారు. విశాఖ - నాందేడ్, నాందేడ్ - విశాఖ రైళ్లను కూడా రద్దు చేశారు. చెన్నై - ఖత్రా ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ, విశాఖ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments