Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో గూడూరు-విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (20:52 IST)
దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సులువుగా చేరేందుకు వీలుగా, గూడూరు-విజయవాడ-గూడూరు మధ్య నూతన ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు చేసిన సూచనకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. 
 
రైల్వేబోర్డు ఆదేశించిన మేరకు రైలు నంబరు 12743 గూడూరు-విజయవాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, ప్రతిరోజూ గూడూరు నుండి ఉదయం 06:10 గంటలకు బయలుదేరి, విజయవాడకు ఉదయం 10:40 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 12744 విజయవాడ-గూడూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, విజయవాడ నుండి ప్రతిరోజూ సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరి, గూడూరుకు రాత్రి 10:30 గంటలకు చేరుతుంది.

మార్గమధ్యంలో ఈ రైలు నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, మరియు తెనాలి రైల్వేస్టేషన్లలో ఆగనున్నది. ఈ రైలు రెండు ఏసి చైర్ కార్, పది నాన్ ఏసి చైర్ కార్, రెండు పవర్ కార్ బోగీలతో మొత్తం పద్నాలుగు బోగీలతో నడవనున్నది. ఈ నూతన రైలుకు సంబంధించిన అధునాతన LHB బోగీలు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నందున, అతి త్వరలో ఈ రైలు ప్రారంభం .

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments