Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో గూడూరు-విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (20:52 IST)
దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సులువుగా చేరేందుకు వీలుగా, గూడూరు-విజయవాడ-గూడూరు మధ్య నూతన ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు చేసిన సూచనకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. 
 
రైల్వేబోర్డు ఆదేశించిన మేరకు రైలు నంబరు 12743 గూడూరు-విజయవాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, ప్రతిరోజూ గూడూరు నుండి ఉదయం 06:10 గంటలకు బయలుదేరి, విజయవాడకు ఉదయం 10:40 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 12744 విజయవాడ-గూడూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, విజయవాడ నుండి ప్రతిరోజూ సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరి, గూడూరుకు రాత్రి 10:30 గంటలకు చేరుతుంది.

మార్గమధ్యంలో ఈ రైలు నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, మరియు తెనాలి రైల్వేస్టేషన్లలో ఆగనున్నది. ఈ రైలు రెండు ఏసి చైర్ కార్, పది నాన్ ఏసి చైర్ కార్, రెండు పవర్ కార్ బోగీలతో మొత్తం పద్నాలుగు బోగీలతో నడవనున్నది. ఈ నూతన రైలుకు సంబంధించిన అధునాతన LHB బోగీలు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నందున, అతి త్వరలో ఈ రైలు ప్రారంభం .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments