Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యేను హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోవాలంటున్న నెటిజన్లు... ఎందుకు?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (13:30 IST)
ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 119 స్థానాల్లో పోటీ చేసి, కేవలం ఒకే ఒక స్థానంలో గెలుపొందింది. హైదరాబాద్ పరిధిలోని గోషా మహల్ స్థానం నుంచి రాజాసింగ్ గెలుపొందారు. ఇక్కడ అత్యధికంగా ముస్లిం ఓటర్లే ఉన్నారు. వీరంతా రాజా సింగ్‌కు ఓటు వేయడం వ్లలే ఆయన గెలిచారు. ఇంతవరకు బాగానేవుంది. 
 
కానీ, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా ముస్లిం సీనియర్ నేత, మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ఎంపిక చేశారు. దీనికి రాజాసింగ్ నిరసన తెలిపారు. ముస్లింనేత ప్రొటెం స్పీకర్‌గా ఉన్నంతకాలం అసెంబ్లీలో అడుగుపెట్టబోనని తేల్చి చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
స్పీకర్‌కు ప్రొటెం స్పీకర్‌కు తేడా తెలియని రాజా సింగ్ నీ అజ్ఞానంతో జనాలను కన్ఫ్యూస్ చేయకు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకొదరు అయితే, అవును, నీవు అసెంబ్లీకి వెళ్లకు. అసెంబ్లీని నిర్మించింది కూడా ముస్లిం రాజే. గోషా మహల్‌ను కూడా నువ్వు వదిలేయ్. గోషామహల్‌ను ముస్లింలే కట్టారు. హైదరాబాద్‌ను ముస్లిమే నిర్మించాడు. అందువల్ల హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళిపో. 
 
హైదరాబాద్‌లో హిందూముస్లింలు గంగా యమునా నదులా కలిసిమెలిసి ఉంటున్నారనీ, ఆ విషయం నీకు అర్థంకాదు. అందువల్ల నీవు రాజస్థాన్‌కు వెళ్లిపో. అక్కడకు వెళ్లి ఏదేని పని చూసుకో. హైదరాబాద్ సంస్కృతి నీకు అర్థంకాదు అంటూ రాజా సింగ్‌ను చీవాట్లు పెడుతున్నారు నెటిజన్లు. రాజకీయాల కోసం హైదరాబాద్ నగర ప్రజల మధ్య అలజడులు సృష్టించాలనుకుంటే నీ పప్పులుడకవ్ అంటూ హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments