Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈతకెళ్లిన ఆరుగురు బాలురు మృతి

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (06:37 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈతకెళ్లిన ఆరుగురు బాలురు దుర్మరణం చెందారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది.

వేలేరుపాడు మండలం బూదేవిపేట గ్రామానికి చెందిన పలువురు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా వసంతవాడ వాగులో ఈత కోసం దిగారు. ఇంతలోనే ఆరుగురు బాలురు గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
 
ఆ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు భూదేవి పేటకు చెందినవారుగా గుర్తించారు. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మృతులంతా 15- 16 సంవత్సరాల మధ్య వయసున్న వారుగా తేలింది. 
మృతుల వివరాలు: 1) గంగాధర వెంకట్రావు (16), 2) శ్రీరాముల శివాజీ (16), 3) గొట్టుపర్తి మనోజ్ (16), 4) కర్నటి రంజిత్ (15), 5) కెల్లాసాయి (16), 6) కూనవరపు రాధాకృష్ణ (15).

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments