Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది.. : విత్తమంత్రి భర్త పరకాల ప్రభాకర్

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (14:41 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ భర్త, ప్రముఖ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ దేశ ఆర్థిక రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను అంగీకరించకపోగా వాస్తవాలను వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. పైపెచ్చు, మాజీ ప్రధానులు వీవీ నరసింహా రావు, డాక్టర్ మన్మోహన్ సింగ్‌ల ఆర్థిక విధానాలే బాగున్నాయని తెలిపారు. 
 
మందగమనంలో ఉన్న వృద్ధిని పరుగులు పెట్టించేందుకు గాను కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం ఎన్ని 'ఉద్దీపన' చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గించేస్తున్నాయి.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందన్నారు. కానీ, వాస్తవాలను కేంద్రం అంగీకరించడం లేదన్నారు. గతంలో దేశ ప్రధానులుగా చేసిన పీవీ నరసింహా రావు, మన్మోహన్ సింగ్‌ల హయాంలోనే దేశ ఆర్థిక విధానాలు బాగున్నాయని కొనియాడారు. 
 
ఇదిలావుంటే, తాజాగా ప్రపంచ బ్యాంకు (డబ్ల్యుబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాని ఏకంగా ఒకటిన్నర శాతం కుదించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 7.5 శాతం ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు, ఇపుడు దాన్ని 6 శాతానికి తగ్గించింది. 
 
గత ఆర్థిక సంవత్సరం (2018-19) నమోదైన 6.8 శాతంతో పోల్చినా ఇది 0.8 శాతం తక్కువ. పైగా, వృద్ధి రేటు మరింత నీరసించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. అదే జరిగితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు తప్పవని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments