Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య మృతదేహానికి కడసారిగా రాఖీ కట్టిన చెల్లెలు

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (16:08 IST)
రక్షాబంధన్‌ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. రాఖీ పౌర్ణమి రోజు ఎక్కడ ఉన్నాసరే.. అన్న లేదా తమ్ముడు క్షేమంగా ఉండాలని తోబుట్టువులు రాఖీ కట్టడానికి పుట్టింటికి వస్తారు. కానీ తాజాగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలికి అనుకోని ఘటన ఎదురైంది. గుండె పోటుతో ఒక్కసారిగా అన్న తుదిశ్వాస విడిచాడు. అన్నయ్య మరణంతో ఆ సోదరి చివరిసారిగా మృతదేహానికి రాఖీ కట్టి అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తు చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం, ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అప్పటివరకు సంతోషంగానే వున్నాడు. కానీ వున్నట్టుండి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
దీంతో చెల్లెలు గౌరమ్మ షాక్‌ అయ్యింది. అన్నయ్య ఇక లేదన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ సోదరి దుఃఖాన్ని చూసి అక్కడ వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. అన్న క్షేమంగా వుండాలని రాఖీ కట్టడానికి వస్తే.. తనకు పుట్టెడు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయాడని గుండెలు పగిలేలా రోదించింది.. ఆ చెల్లెలు. ఆపై కడసారిగా అన్నయ్య మృతదేహానికి రాఖీ కట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments