Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య మృతదేహానికి కడసారిగా రాఖీ కట్టిన చెల్లెలు

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (16:08 IST)
రక్షాబంధన్‌ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. రాఖీ పౌర్ణమి రోజు ఎక్కడ ఉన్నాసరే.. అన్న లేదా తమ్ముడు క్షేమంగా ఉండాలని తోబుట్టువులు రాఖీ కట్టడానికి పుట్టింటికి వస్తారు. కానీ తాజాగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలికి అనుకోని ఘటన ఎదురైంది. గుండె పోటుతో ఒక్కసారిగా అన్న తుదిశ్వాస విడిచాడు. అన్నయ్య మరణంతో ఆ సోదరి చివరిసారిగా మృతదేహానికి రాఖీ కట్టి అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తు చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం, ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అప్పటివరకు సంతోషంగానే వున్నాడు. కానీ వున్నట్టుండి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
దీంతో చెల్లెలు గౌరమ్మ షాక్‌ అయ్యింది. అన్నయ్య ఇక లేదన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ సోదరి దుఃఖాన్ని చూసి అక్కడ వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. అన్న క్షేమంగా వుండాలని రాఖీ కట్టడానికి వస్తే.. తనకు పుట్టెడు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయాడని గుండెలు పగిలేలా రోదించింది.. ఆ చెల్లెలు. ఆపై కడసారిగా అన్నయ్య మృతదేహానికి రాఖీ కట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments