Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతపై ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వెళితే చితికబాదిన ఎస్ఐ

Webdunia
సోమవారం, 2 మే 2022 (09:02 IST)
తన తల్లికి పింఛన్‌ను నిలిపివేయాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వైకాపా నేతపై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్ ఎస్.ఐ చితకబాదాడు. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో జరిగింది. బాధితుడిని ఎస్ఐ చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జిల్లా ఎస్పీ స్పందించి ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిలమత్తూరు గ్రామానికి చెందిన పద్మావతమ్మ అనే మహిళ మద్దతురాలని, అందువల్ల ఆమె ఇస్తున్న పింఛన్ తొలగించాలని స్థానిక వైకాపా నేత దామోదర్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన గ్రామ సచివాలయ కార్యదర్శి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించడంతో పింఛన్ ఇస్తున్నారు. 
 
అయితే, తన పింఛనును తొలగించేందుకు దామోదర్ రెడ్డి ప్రయత్నించినట్టు పద్మావతమ్మకు తెలియడంతో తన కుమారుడు వేణును వెంటబెట్టుకుని వైకాపా నేత ఇంటికి వెళ్ళింది. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. అంతటితో ఊరుకోని దామోదర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వేణు తాగి తన ఇంటి ముందు గొడవ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో వారొచ్చి వేణును మందలించి వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాతి రోజు వేణు మరికొందరితో కలిసి దామోదర్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. వేణును చూసిన వెంటనే అకారణంగానే ఎస్ఐ రంగడు ఆగ్రహంతో ఊగిపోతూ చెలరేగిపోయాడు. నానా బూతులు తిడుతూ చేయి చేసుకున్నాడు. వేణును చితకబాదాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ విచారణ జరిపేందుకు పెనుకొండ డీఎస్పీ రమ్యను నియమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments