సీఎం జగన్‌కు షాక్... రాజధాని తరలింపునకు నో చెప్పిన కేంద్రం?

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విశాఖపట్టణానికి తరలించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇందుకోసం ఆయన కరోనా కష్టకాలంలో కూడా వ్యూహ రచనలు చేస్తున్నట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి, కేంద్రం అనుమతి ఉన్నా లేకున్నా ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారం నుంచి రాజధాని కార్యకలాపాలను విశాఖపట్టణం నుంచి శ్రీకారం చుట్టాలన్న తపనలో జగన్ ఉన్నట్టు సమాచారం. 
 
ఇందులోభాగంగానే, ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుడు, సీఎం జగన్ కుడిభుజమైన విజయసాయి రెడ్డి కూడా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. విశాఖపట్టణంలో కరోనా కేసులు సంఖ్య తగ్గిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ జిల్లాలో మొత్తం 20 కేసులు నమోదు కాగా, పది కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ఏపీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రాజాధాని తరలింపునకు కేంద్రం నో చెప్పినట్టు ఆ వార్త సారాంశం. ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా నిధుల కొరత రాష్ట్రంలో ఏర్పడే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించినట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటి ఏప్రిల్ నెలాఖరు వరకు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments