Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సూపర్ కాంబో ప్లాన్.. రూ.199కి 1000 జీబీ డేటా

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:16 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో.. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరికొందరు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా వినియోగం భారీగా పుంజుకుంది. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని టెలికాం రంగ సంస్థలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. 
 
తాజాగా రిలయన్స్ జియో ఫైబర్ (ఫైబర్-టు-హోమ్) వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన కాంబో ప్లాన్‌ను ప్రకటించింది. రూ.199లకు వేగవంతమైన 1000 జీబీ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఈ ప్లాన్ వాలిడిటీ స్వల్ప కాలం అంటే 7 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, ఈ ప్లానులో డేటా 100 ఎంబీపీఎస్ వేగంతో వస్తుంది. మరో విషయం ఏమిటంటే, రూ. 199 కాంబో ప్లాన్ జీఎస్టీతో కలిపి మొత్తం రూ. 234 ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.
 
ఈ కాంబో ప్లాన్ ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అయిపోయిన వారికి, లేదా అదనపు డేటా అవసరం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే లిమిట్ దాటిన అనంతరం ఇది ఒక ఎంబీపీఎస్‌కు పడిపోతుందని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments