Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దివానోస్ పేకాట క్లబ్' పేరుతో హీరో మహేష్ బాబు చెల్లికి శిల్పా చౌదరి టోకరా

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (08:59 IST)
కిలేడీ శిల్పా చౌదరి లీలలు రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్నాయి. పలువురు సెలెబ్రిటీలను మోసం చేసిన ఈమె కోట్లు దండుకున్నారు. ఇలాంటివారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని కూడా ఉన్నారు. ఈమె వద్ద రూ.2 కోట్ల మేరకు శిల్పాచౌదరి టోకరా పెట్టినట్టు తెలుస్తోంది. 
 
హైదరాబాద్ నగరం, గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసం ఉంటూ వచ్చిన శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ అనే దంపతులు దివానోస్ పేరుతో ఓ పేకాట క్లబ్‌ను ప్రారంభించారు. పైగా, కోటీశ్వరులుగా తమను తాము పరిచయం చేసుకున్నవీరు టీవీ, సినీ నిర్మతలుగా నమ్మించారు. అలా అనేక మంది సినీ ప్రముఖులను కలుసుకుంటూ వీకెండ్ పార్టీలకు ఆహ్వానించేవారు. 
 
ఆరంభంలో అతి తక్కువ మందితో కిట్టీపార్టీ మొదలుకాగా, ఆ తర్వాత ఆ పార్టీలను దివానోస్ పేరుతో పేకాట క్లబ్బుగా మార్చేశారు. ఇందులో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దాదాపు 100 మంది వరకు సెలెబ్రిటీల కుటుంబాలకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నారు. 
 
అయితే, శిల్పా చౌదరి దంపతుల చేతిలో మోసపోయినట్టు గ్రహించిన ప్రియదర్శిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి కూపీలాగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments