Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సీఎం మాత్రమే కాదు.. పీఎమ్ అవుతారు.. ఆ రెడ్ టవల్?: షకలక శంకర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి సీఎం అవుతారని.. ఆ తర్వాత పీఎం కూడా అవుతారని ఆయన వీరాభిమాని షకలక శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (10:38 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి సీఎం అవుతారని.. ఆ తర్వాత పీఎం కూడా అవుతారని ఆయన వీరాభిమాని షకలక శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. 
 
ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, అదే సగం బలమని చెప్పిన షకలక శంకర్, అలాంటి టవల్‌ను తాను కూడా వాడుతుంటానని తెలిపాడు. ఇకపోతే పవన్‌తో కలిసి సినిమాల్లో నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. పవన్..సీఎం అవుతుంటే, ఆయనతో కలిసి ఇంకా సినిమాల్లో ఎలా నటిస్తానని చెప్పాడు. 
 
ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఏజెన్సీలోని అరకు, పాడేరు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలను సందర్శించారు. డుండ్రిగూడ మండలం పనసపొట్టు గ్రామంలోని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా కలుషిత నీరు వల్ల తాము జబ్బుల బారిన పడుతున్నామని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన పవన్... నీటి నమూనాలను తీసి, పరీక్షలు చేయించాలని పార్టీ నేతలకు సూచించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments