Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని గోదావరి జిల్లాల వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక..

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (16:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రవాసులకు భారత వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. వచ్చే 48 గంటలల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు. అదేవిధంగా 24వ తేదీ వరకు కోస్తాలో తేలికపాటి వర్షాలు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇస్రో తెలిపింది. 
 
తెలంగాణాలో ఉదయం సమయంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో రాత్రి సమయాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. నిర్మల్, ఖమ్మం, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని గుర్తుచేసింది. 
 
ఐఎండీ శుభవార్త... 
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. వచ్చే ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎండల తీవ్ర తగ్గుతాయని పేర్కొంది. అలాగే, వడగాలులు కూడా వీచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. అదేసమయంలో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది. 
 
తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడివుందని, ఫలింతగా ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా మేరకు తగ్గుతాయని పేర్కొంది. 
 
ఆంధ్రప్రదేశ్, బీహార్, దక్షిణ కర్నాటక ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వానలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా తెలిపింది. దీంతో ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్న దేశ ప్రజలకు కొంతమేరకు ఉపశమనం కలగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments