Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో మునిగిన బోటు.. 61 మంది..? వరద ఉద్ధృతి వున్నా.. పర్మిషన్లు..

Webdunia
ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (15:05 IST)
గోదావరిలో పడవ మునిగింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద 61 మందితో ప్రయాణిస్తున్న ఓ టూరిజం బోటు మునిగిపోయింది. బోటు పాపికొండలు ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు తెలుస్తోంది.  పోలవరం/గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు. సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్లు గోదావరిలో మునిగిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. 
 
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ఠ అనే పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో 15 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరినట్టు తెలుస్తోంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటక బోటు ప్రయాణానికి అనుమతినిచ్చిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments