Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుపై ఏపీ సర్కారుకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (12:50 IST)
ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్)కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ చుక్కెదురైంది. పైగా, ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు కూడా అపెక్స్ కోర్టు నిరాకరించింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా, 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అందువల్ల ఈ కేసు, బెయిల్ వ్యవహారంలో చంద్రబాబుకు సైతం నోటీసులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments