Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవోగా శ్యామలరావు నియామకం : బాబు సర్కారు ఉత్తర్వులు

వరుణ్
శనివారం, 15 జూన్ 2024 (08:52 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్య నిర్వహణాధికారిగా (ఈవో)గా జె.శ్యామలరావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తితిదే ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో కొత్త ఈవోగా శ్యామలరావును నియమించింది. ప్రస్తుతం ఈయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయ గతంలో కూడా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పని చేశారు. నిజాయితీపరుడిగా పేరున్న శ్యామలరావును తితిదే ఈవోగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంపిక చేసి ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో రాష్ట్రంలోని పలు కీలక పదవుల్లో ఉన్న వారు స్వచ్చంధంగా తప్పిస్తున్నారు. అలా తప్పుకోనివారిని ప్రభుత్వం బలవంతంగా ఇంటికి పంపుతుంది. అలాగే, తితిదే ఈవో ధర్మారెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. మరోవైపు, ఇటీవల తిరుమలకు వెళ్లిన చంద్రబాబు... రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన చేపడుతామని ప్రకటించారు. ఆ ప్రకారంగానే పాలనకు శ్రీకారం చుట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments