Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవోగా శ్యామలరావు నియామకం : బాబు సర్కారు ఉత్తర్వులు

వరుణ్
శనివారం, 15 జూన్ 2024 (08:52 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్య నిర్వహణాధికారిగా (ఈవో)గా జె.శ్యామలరావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తితిదే ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో కొత్త ఈవోగా శ్యామలరావును నియమించింది. ప్రస్తుతం ఈయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయ గతంలో కూడా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పని చేశారు. నిజాయితీపరుడిగా పేరున్న శ్యామలరావును తితిదే ఈవోగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంపిక చేసి ఉత్తర్వులు జారీచేసింది. 
 
కాగా, ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో రాష్ట్రంలోని పలు కీలక పదవుల్లో ఉన్న వారు స్వచ్చంధంగా తప్పిస్తున్నారు. అలా తప్పుకోనివారిని ప్రభుత్వం బలవంతంగా ఇంటికి పంపుతుంది. అలాగే, తితిదే ఈవో ధర్మారెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. మరోవైపు, ఇటీవల తిరుమలకు వెళ్లిన చంద్రబాబు... రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన చేపడుతామని ప్రకటించారు. ఆ ప్రకారంగానే పాలనకు శ్రీకారం చుట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments