Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో మంటలు చెలరేగాయంటూ పుకార్లు : భయంతో కిందకు దూకిన ప్రయాణికులు.. ముగ్గురు మృతి!!

వరుణ్
శనివారం, 15 జూన్ 2024 (08:38 IST)
రైలులో మంటలు చెలరేగాయంటూ గుర్తు తెలియని వ్యక్తలుు పుకార్లు పుట్టించారు. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వీరిలో కొందరు రైలు నుంచి దూకేశారు. అలాంటి వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కుమన్‌డీహ్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. రాంచీ - ససరామ్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు అంటుకున్నాయంటూ కొందరు పుకార్లు పుట్టించారు. దీంతో ముగ్గురు ప్రయాణికులు రైలు నుంచి కిందకు దూకేశారు. 
 
ఇదే సమయంలో మరో ట్రాక్‌పై నుంచి వస్తున్న గూడ్సు రైలు వారిని ఢీకొట్టడంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగాయని స్టేషన్ మాస్టర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో ఆయన రైలును ఆపివేశాడు. ఆ వెంటనే భయంతో ముగ్గురు ప్రయాణికులు ఒకే ట్రాక్‌పై దూకడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటన వెనుక ఏదైనా లక్ష్యంగా ఉందా లేదా నక్సల్స్ చర్యా అన్న కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments