Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు హై సెక్యూరిటీ.. పోలీసుల సెలవులు రద్దు

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. మొత్తం నాలుగు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరుగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంతో పాటు.. నిమ్మగడ్డ నివాసాల వద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచారు. ముఖ్యంగా, ఎన్నికల కార్యాలనికి వచ్చే ప్రతి వ్యక్తితో పాటు.. వాహనాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. తన ప్రాణానికి ముప్పు పొంచివుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంటివద్ద 24 గంటల పాటు సెక్యూరీటీ బలగాలు విధులు నిర్వహించనున్నాయి. 
 
మరోవైపు, ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖలోని అన్ని విభాగాల సిబ్బందికీ.. సాధారణ సెలవులు, వారాంతపు సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలు జారీ చేశారు. 
 
బుధవారం నుంచి ఫిబ్రవరి 21వరకు సెలవుల రద్దు అమల్లో ఉంటుందని తెలిపారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహణ జరుగుతుందని.. ఆరోగ్య రీత్యా , అత్యవసర పరిస్థితుల్లో వారాంతపు సెలవును పరిగణలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments