నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు హై సెక్యూరిటీ.. పోలీసుల సెలవులు రద్దు

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. మొత్తం నాలుగు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరుగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంతో పాటు.. నిమ్మగడ్డ నివాసాల వద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచారు. ముఖ్యంగా, ఎన్నికల కార్యాలనికి వచ్చే ప్రతి వ్యక్తితో పాటు.. వాహనాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. తన ప్రాణానికి ముప్పు పొంచివుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంటివద్ద 24 గంటల పాటు సెక్యూరీటీ బలగాలు విధులు నిర్వహించనున్నాయి. 
 
మరోవైపు, ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖలోని అన్ని విభాగాల సిబ్బందికీ.. సాధారణ సెలవులు, వారాంతపు సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలు జారీ చేశారు. 
 
బుధవారం నుంచి ఫిబ్రవరి 21వరకు సెలవుల రద్దు అమల్లో ఉంటుందని తెలిపారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహణ జరుగుతుందని.. ఆరోగ్య రీత్యా , అత్యవసర పరిస్థితుల్లో వారాంతపు సెలవును పరిగణలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments