Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల స్నానాల గదుల్లో సీక్రెట్ కెమేరాలు: సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఐవీఆర్
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (12:29 IST)
అమ్మాయిల స్నానాల గదుల్లో సీక్రెట్ కెమేరాలు అమర్చిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో లేడీస్ హాస్టల్ స్నానాల గదుల్లో సీక్రెట్ కెమేరాలు పెట్టారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై తమకు న్యాయం చేయాలంటూ హాస్టల్ విద్యార్థునులు నిన్న రాత్రి ఆందోళనకు దిగారు. సీక్రెట్ కెమేరాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు.
 
అసలేం జరిగింది?
గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలోని స్నానాల గదుల్లో సీక్రెట్ కెమేరాలను అమర్చారని గురువారం అర్థరాత్రి దాటాక విద్యార్థునులు ఆందోళన చేపట్టారు. వాష్ రూములలో సీక్రెట్ కెమేరాలు పెట్టి ఆ వీడియోలను విక్రయిస్తున్నాడంటూ ఓ బీటెక్ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టలకి వెళ్లి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి నుంచి అతడి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తున్నదంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments