Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

సెల్వి
శుక్రవారం, 17 మే 2024 (16:59 IST)
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలు ముగిసే వరకు దానిపై మాట్లాడవద్దని కడప జిల్లా కోర్టు గత నెలలో కొంతమంది ప్రతిపక్ష నేతలను ఆదేశించింది. వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, బీటెక్ రవి, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి వంటి నేతలు ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు గురించి మాట్లాడవద్దని ఆదేశించారు. 
 
కడప జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ షర్మిల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో షర్మిల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి కడప కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్‌పై స్టే విధించింది. ప్రతివాదుల వాదనలు కూడా వినకుండానే జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
కడప కోర్టు తీర్పు వాక్ స్వాతంత్య్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛను నిర్బంధిస్తోందని మెజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారు. నిందితులందరికీ నోటీసులు జారీ చేసిన మేజిస్ట్రేట్.. వేసవి సెలవులు ముగిసిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments