Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (16:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి లండన్‍‌, యూరప్ వంటి దేశాల పర్యటన కోసం వెళుతున్నారు. ఈ పర్యటనలోభాగంగా, ఆయన ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా పర్యటించనున్నారు. ఈ టూర్‌‌ను ముగించుకుని ఈ నెల 31వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌‍సభ ఎన్నికల కోసం ఆయన దాదాపు రెండు నెలల పాటు బిజీగా గడిపారు. ఈ క్రమంలో ఆయన విశ్రాంతి తీసుకునేందుకు తన భార్య భారతితో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆయన విజయవాడ నుంచి లండన్‌కు బయలుదేరి వెళతారు. జగన్ కుమార్తెలు లండన్‍‌లో ఉంటున్న విషయం తెల్సిందే. తొలుత లండన్‌కు చేరుకుని అక్కడ తన కుమార్తెలను వెంటబెట్టుకుని ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. 
 
కాగా, జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసుకోగా దాన్ని విచారించిన కోర్టు ఈ నెల 17 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ పర్యటనలో ఆయన వాడే మొబైల్ నంబర్, ఈమెయిల్ తదితర వివరాలను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులకు జగన్ సమ్మతించడంతో విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments