Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో దారుణం: చాక్లెట్ కోసం వంగి.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు..

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (10:28 IST)
కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బస్సు చక్రాల కింద పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాలకు పంపడానికి నాన్నతోపాటు వెళ్లిన బాబు జీవితాన్ని బస్సు చిదిమేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోడూరుకు చెందిన శ్రీనివాసరావు, ప్రభావతి దంపతులకు ఆదిత్య, దినేష్‌కుమార్‌(3) కుమారులు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్య ఎల్‌కేజీ చదువుతున్నాడు. 
 
మంగళవారం శ్రీనివాసరావు... ఆదిత్యను బస్సెక్కించేందుకు తీసుకురాగా వారి వెనుకనే దినేష్‌కుమార్‌ నడుచుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో చేతిలోని చాక్లెట్‌ కిండపడటంతో దాన్ని తీసుకోవడానికి బస్సు వెనుక చక్రాల కిందకు దినేష్‌ వంగాడు. చిన్నారిని ఎవరూ గమనించలేదు. 
 
డ్రైవర్‌ బస్సును ముందుకు నడపడంతో చక్రాల కింద తల నలిగి దినేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన శ్రీనివాసరావు స్పృహతప్పి పడిపోయారు. 
 
క్షణకాలంలో చిన్నారి మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది. స్థానికంగా విషాదం నెలకొంది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments