Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో దారుణం: చాక్లెట్ కోసం వంగి.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు..

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (10:28 IST)
కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బస్సు చక్రాల కింద పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాలకు పంపడానికి నాన్నతోపాటు వెళ్లిన బాబు జీవితాన్ని బస్సు చిదిమేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోడూరుకు చెందిన శ్రీనివాసరావు, ప్రభావతి దంపతులకు ఆదిత్య, దినేష్‌కుమార్‌(3) కుమారులు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్య ఎల్‌కేజీ చదువుతున్నాడు. 
 
మంగళవారం శ్రీనివాసరావు... ఆదిత్యను బస్సెక్కించేందుకు తీసుకురాగా వారి వెనుకనే దినేష్‌కుమార్‌ నడుచుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో చేతిలోని చాక్లెట్‌ కిండపడటంతో దాన్ని తీసుకోవడానికి బస్సు వెనుక చక్రాల కిందకు దినేష్‌ వంగాడు. చిన్నారిని ఎవరూ గమనించలేదు. 
 
డ్రైవర్‌ బస్సును ముందుకు నడపడంతో చక్రాల కింద తల నలిగి దినేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన శ్రీనివాసరావు స్పృహతప్పి పడిపోయారు. 
 
క్షణకాలంలో చిన్నారి మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది. స్థానికంగా విషాదం నెలకొంది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments