Webdunia - Bharat's app for daily news and videos

Install App

యురేనియం డ్రిల్లింగ్‌ పనులు జిల్లా కలెక్టర్‌కు తెలియదా?

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (11:23 IST)
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందుకోసం సేవ్ నల్లమల అనే సోషల్ మీడియా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అదేసమయంలో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కారు అనుమతి ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ పనులు సాగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనిపై వరుస ట్వీట్స్ చేశారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవా? అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్‌కు తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు. 
 
పైగా, నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రజలకు మద్దతు ఇచ్చేందుకు, వారితో కలిసి పోరాడేందుకు తాము ఉన్నామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ కోసం విమలక్క పాడిన పాట వీడియోతో పాటు యురేనియం డ్రిల్లింగ్ పనులకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments