Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో ఇసుక దొంగలు

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (10:53 IST)
"కార్మికుల ఆకలి మంటల్లో జగన్ ప్రభుత్వం కాలిపోక తప్పదు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దొంగలు పడ్డారు.. భవన నిర్మాణ కార్మికుల కడుపు మండుతోంది..

ఇసుక లేక తాపీ మేస్త్రీ పనులు ఆపేశారు.. కార్మికుల ఆకలి మంటల్లో జగన్ ప్రభుత్వం కాలిపోక తప్పదు.. టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా సరఫరా చేశాం.. చేతకాని ప్రభుత్వం కర్షక కార్మికుల పొట్ట కొడుతోంది" అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని గాటుగా విమర్శించారు. 

తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద  రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించిన వైసీపీ ప్రభుత్వంపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం తమ నాయకులు, కార్యకర్తలకు దొడ్డిదారిన సంపాదించి పెట్టెలా పాలసీ అమలు చేస్తున్నారు అని ఆరోపించారు.

ఇసుకాసురుల భరతం పట్టాల్సిన అధికారులు దగ్గరుండి మరీ అక్రమ ఇసుక రవాణాలను ప్రోత్సహిస్తున్నారు అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇసుక కొరత లేకుండా చేసి అందరికీ అందు బాటులోకి తెచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments