సీఆర్టీలకు సెలవుల్లోనూ వేతనాలు: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

Webdunia
బుధవారం, 20 మే 2020 (08:42 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు సెలవురోజుల్లోనూ వేతనాలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు.

గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ) లకు ఇప్పటివరకు వారు పనిచేస్తున్న కాలానికి మాత్రమే వేతనాలను చెల్లిస్తున్నామని పుష్ప శ్రీవాణి మంగళవారం మీడియా కు విడుదలచేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యాసంస్థలకు చివరి పనిదినమైన ఏప్రిల్ 23 వ తేదివరకు మాత్రమే సీఆర్టీల పనిదినాలను పరిగణలోకి తీసుకోవడం జరిగేదని చెప్పారు. ఈ కారణంగా ఏప్రిల్ 23 నుంచి మళ్లీ విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యే జూన్ 12 దాకా వారికి వేతనాలను ఇచ్చేవారు కాదని తెలిపారు.

అయితే తమకు సెలవు కాలంలోనూ వేతనాలివ్వాలంటూ సీఆర్టీలు చేసిన విన్నపాన్ని ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఇక నుంచి సీఆర్టీలకు వారి సర్వీసు నిబంధనల ప్రకారంగా పది రోజులు మినహాయించి మిగిలిన మొత్తం కాలానికి వేతనాలను చెల్లించనున్నామని వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని పుష్ప శ్రీవాణి వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments