Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు

విద్యను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు
, సోమవారం, 18 నవంబరు 2019 (10:22 IST)
ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీ లక్ష్మీ గణపతి సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు అందరికీ ఆదర్శమని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 
 
సోమవారంవారం శ్రీ  విగ్నేశ్వర దేవస్థానం, శ్రీ లక్ష్మీ గణపతి సేవాసమితి భవానిపురం వారి ఆధ్వర్యంలో స్వాతి థియేటర్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల సేవలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతిభ గల పేద విద్యార్థులను బంగారు బాట కోసం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను  మంత్రి అభినందించారు. 
 
ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి సేవాసమితి అధ్యక్షులు వెలంపల్లి సూర్యనారాయణ గారు, బచ్చు కోటేశ్వరరావు, గోపిశెట్టి మల్లయ్య, సాదు సత్యనారాయణ, నాళం చలపతిరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్యాటక బోట్లపై నిరంతర నిఘా : ఏపీ సర్కారు నిర్ణయం