Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలినేని ఇంటికి మూడోసారి సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (15:31 IST)
మంత్రిపదవి దక్కలేదని అలకపాన్పునెక్కిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, బాలినేని ఇంటికి సజ్జల మూడోసారి వెళ్లారు. ఇప్పటికే రెండు పర్యాయాలు మాజీ మంత్రికి ఇటికి వెళ్లినా బాలినేని ఆగ్రహం చల్లారలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన తనను తప్పించి, విద్యాశాఖామంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ను ఏ విధంగా కొనసాగిస్తారంటూ సజ్జను బాలినేని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల జిల్లాలో పట్టుకోల్పోతానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన తన తదుపరి కార్యాచరణపై సోమవారం తన సహచరులతో మంతనాలు జరుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ముచ్చటగా మూడో పర్యాయం కూడా బాలినేని ఇంటికి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు. ఆయన వెంట పార్టీ సీనియర్లు గండికోట శ్రీకాంత్ రెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురాం పాటు మరికొందరు నేతలు భారీ సంఖ్యలో ఇంటికి వెళ్లారు. సీఎం జగన్ ఆదేశం మేరకే బాలినేని ఇంటికి సజ్జల మూడో పర్యాయం కూడా వెళ్లినట్టు సమాచారం. బాలినేనితో స్వయంగా తానే మాట్లాడుతానని, అందువల్ల బాలినేనిని తన వద్దకు తీసుకునిరావాలని సజ్జలను కోరినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments