Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలినేని ఇంటికి మూడోసారి సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (15:31 IST)
మంత్రిపదవి దక్కలేదని అలకపాన్పునెక్కిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, బాలినేని ఇంటికి సజ్జల మూడోసారి వెళ్లారు. ఇప్పటికే రెండు పర్యాయాలు మాజీ మంత్రికి ఇటికి వెళ్లినా బాలినేని ఆగ్రహం చల్లారలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన తనను తప్పించి, విద్యాశాఖామంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ను ఏ విధంగా కొనసాగిస్తారంటూ సజ్జను బాలినేని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల జిల్లాలో పట్టుకోల్పోతానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన తన తదుపరి కార్యాచరణపై సోమవారం తన సహచరులతో మంతనాలు జరుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ముచ్చటగా మూడో పర్యాయం కూడా బాలినేని ఇంటికి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు. ఆయన వెంట పార్టీ సీనియర్లు గండికోట శ్రీకాంత్ రెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురాం పాటు మరికొందరు నేతలు భారీ సంఖ్యలో ఇంటికి వెళ్లారు. సీఎం జగన్ ఆదేశం మేరకే బాలినేని ఇంటికి సజ్జల మూడో పర్యాయం కూడా వెళ్లినట్టు సమాచారం. బాలినేనితో స్వయంగా తానే మాట్లాడుతానని, అందువల్ల బాలినేనిని తన వద్దకు తీసుకునిరావాలని సజ్జలను కోరినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments