Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలినేని ఇంటికి మూడోసారి సజ్జల రామకృష్ణారెడ్డి

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (15:31 IST)
మంత్రిపదవి దక్కలేదని అలకపాన్పునెక్కిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, బాలినేని ఇంటికి సజ్జల మూడోసారి వెళ్లారు. ఇప్పటికే రెండు పర్యాయాలు మాజీ మంత్రికి ఇటికి వెళ్లినా బాలినేని ఆగ్రహం చల్లారలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన తనను తప్పించి, విద్యాశాఖామంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ను ఏ విధంగా కొనసాగిస్తారంటూ సజ్జను బాలినేని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల జిల్లాలో పట్టుకోల్పోతానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన తన తదుపరి కార్యాచరణపై సోమవారం తన సహచరులతో మంతనాలు జరుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ముచ్చటగా మూడో పర్యాయం కూడా బాలినేని ఇంటికి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు. ఆయన వెంట పార్టీ సీనియర్లు గండికోట శ్రీకాంత్ రెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురాం పాటు మరికొందరు నేతలు భారీ సంఖ్యలో ఇంటికి వెళ్లారు. సీఎం జగన్ ఆదేశం మేరకే బాలినేని ఇంటికి సజ్జల మూడో పర్యాయం కూడా వెళ్లినట్టు సమాచారం. బాలినేనితో స్వయంగా తానే మాట్లాడుతానని, అందువల్ల బాలినేనిని తన వద్దకు తీసుకునిరావాలని సజ్జలను కోరినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments