Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత్యుఒడిలోకి చేరేందుకు గంట ముందు కుటుంబ సభ్యులకు సాయితేజ ఫోన్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (09:32 IST)
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా ఉన్న చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడి గ్రామానికి చెందిన బి.సాయితేజ ఇంట్లోనూ, గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాతపడిన వారిలో సాయితేజ ఒకరు. 
 
ఈయన మృత్యుఒడిలోకి చేరుకునేందుకు గంట ముందు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సంతోషంగా మాట్లాడారు. ఈ విషయాన్ని తలచుకుని సాయితేజ భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. బోరున విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. అలాగే, గ్రామమంతా విషాదచాయలు అలముకున్నాయి. 
 
సాయితేజకు జిల్లాలోని కురబలకోట మండలం ఎగువ రేగడి గ్రామం. ఈ ప్రమాదం జరగడానికి ముందు సాయితేజ తన భార్య శ్యామలకు వీడియోకాల్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన కొద్దిసేపటికే మృత్యుఒడిలోకి జారుకున్నారు. కాగా, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు, సాయితేజతో పాటు.. మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం 80 శాతం కాలిన గాయాలతో ఆర్మీ  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments