Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ మృతుల్లో తెలుగు వాసి... సాయితేజ స్వగ్రామం రేగడలో విషాదం..

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (09:00 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి అటవీప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన అర్థాంగి మధులికా రావత్‌ సహా 13 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో రావత్ వ్యక్తిగత సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలోనే సాయితేజ కూడా మృత్యువాతపడ్డారు. 
 
ఈయన సొంతూరు జిల్లాలోని కురబలకోటం మండలం, రేగడ గ్రామం. 2013లో భారత సైన్యంలో చేరారు. సైన్యంలో లాన్స్ నాయక్‌ స్థాయికి ఎదిగిన సాయితేజ... ప్రస్తుతం బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
 
ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. రేగడ గ్రామ ప్రజలు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. గత సెప్టెంబరు నెలలో వినాయకచవితి పండుగ కోసం సాయితేజ చివరిసారి తన స్వగ్రామానికి వచ్చారు. ఇపుడు శాశ్వత లోకాలకు చేరుకున్నారు. ఈయన పార్థివదేహం గురువారం సొంతూరుకు తరలించే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments