నేను మగాడినని నిరూపించుకోవాలి... నన్ను ల్యాబ్‌కు పంపండి : రాజేష్

చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు మండలంలో పెళ్ళయిన రోజే తన భర్త రాజేష్ నపుంశకుడని అతడి భార్య శైలజ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి వ్యవహారం కాస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారి చివరకు కోర్టు మెట్లెక్కింది. అయితే తాజాగా తాను మ

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (20:13 IST)
చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు మండలంలో పెళ్ళయిన రోజే తన భర్త రాజేష్ నపుంశకుడని అతడి భార్య శైలజ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి వ్యవహారం కాస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారి చివరకు కోర్టు మెట్లెక్కింది. అయితే తాజాగా తాను మగాడినే, తనకు లైంగిక పటుత్వ పరీక్షలు  చేయండంటూ చిత్తూరు కోర్టును ఆశ్రయించాడు రాజేష్. 
 
ఇప్పటివరకు క్రిమినల్ కేసుల్లో లైంగిక పటుత్వ పరీక్షలు చేసిన దాఖలాలు లేవని రాజేష్ తరపు న్యాయవాది త్రిమూర్తి చెబుతున్నారు. అయితే రాజేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను తనకు పొటెన్సీ పరీక్ష చేయాలని పట్టుబడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం చిత్తూరు మూడవ అదనపు కోర్టులో రాజేష్ పిటిషన్‌ను దాఖలు చేస్తే ఇప్పటివరకు కూడా న్యాయమూర్తి విచారణ జరపలేదు. 
 
గత రెండురోజులుగా వాయిదా వేస్తూనే వస్తున్నారు. త్వరగా తనను పొటెన్సీ పరీక్షలకు పంపించాలని రాజేష్ వేడుకొంటున్నాడు. నేను మగాడినని నిరూపించుకునేందుకు ఇదొక్కటే నాకున్న అవకాశమంటూ న్యాయమూర్తికి ఒక వినతిపత్రం కూడా రాజేష్ రాసి బంధువుల ద్వారా కోర్టుకు పంపాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం