Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుంచి శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:48 IST)
చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 18నుంచి 20వ తేది వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలిసో తెలియకో జరిగిన దోషాల నివారణకు మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

కొవిడ్‌ నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. 17న సాయంత్రం అంకురార్పణ, 18న పవిత్ర ప్రతిష్ఠ, 19, పవిత్ర సమర్పణ, 20న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.

చివరిరోజు మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం నిర్వహించనున్నారు.

పవిత్రోత్సవాలను పురస్కరించుకుని 14న జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, 17న కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజల్‌సేవ, సాయంత్ర బ్రేక్‌ దర్శనాన్ని, 20నుంచి మూడు రోజులు పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఉదయం, సాయంత్రం బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments