18 నుంచి శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:48 IST)
చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 18నుంచి 20వ తేది వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలిసో తెలియకో జరిగిన దోషాల నివారణకు మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

కొవిడ్‌ నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. 17న సాయంత్రం అంకురార్పణ, 18న పవిత్ర ప్రతిష్ఠ, 19, పవిత్ర సమర్పణ, 20న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.

చివరిరోజు మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం నిర్వహించనున్నారు.

పవిత్రోత్సవాలను పురస్కరించుకుని 14న జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, 17న కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజల్‌సేవ, సాయంత్ర బ్రేక్‌ దర్శనాన్ని, 20నుంచి మూడు రోజులు పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఉదయం, సాయంత్రం బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments