Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణానికి అక్షరాలా రూ.లక్ష కేటాయింపు!

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (08:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నవ్యాంధ్రపై ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర సర్కారు కక్ష కట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత నెలలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో అమరావతిలో సచివాలయ నిర్మాణానికి కేవలం లక్ష అంటే లక్ష రూపాయులు మాత్రమే కేటాయించింది. 
 
మొత్తం రూ.1214.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం మొదలుపెట్టిన కేంద్రీయ సచివాలయం కోసం ఈ లక్ష రూపాయల కేటాయింపులు చేసింది. గత యేడాది కూడా ఈ పద్దు కింద కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. 
 
నిజానికి ఏపీ ముంఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని ఎపుడో అటకెక్కించింది. మధ్యలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. న్యాయ వివాదాల నేపథ్యంలో ఈ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అధికారికంగా అమరావతేనని కేంద్రం కూడా గుర్తించింది. 
 
అదేసమయంలో అమరావతిలో రూ.6.69 కోట్ల వ్యయంతో జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (జీపీఏవో, కేంద్ర ఉద్యోగుల నివాసాలు) కోస భూమి కొనుగోలుకు కూడా కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. దీని కోసం ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రూ.4.48 కోట్లను ఖర్చు చేయగా, ఈ ఆర్థిక బడ్జెట్‌లో రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments