Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణానికి అక్షరాలా రూ.లక్ష కేటాయింపు!

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (08:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నవ్యాంధ్రపై ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర సర్కారు కక్ష కట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత నెలలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో అమరావతిలో సచివాలయ నిర్మాణానికి కేవలం లక్ష అంటే లక్ష రూపాయులు మాత్రమే కేటాయించింది. 
 
మొత్తం రూ.1214.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం మొదలుపెట్టిన కేంద్రీయ సచివాలయం కోసం ఈ లక్ష రూపాయల కేటాయింపులు చేసింది. గత యేడాది కూడా ఈ పద్దు కింద కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. 
 
నిజానికి ఏపీ ముంఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని ఎపుడో అటకెక్కించింది. మధ్యలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. న్యాయ వివాదాల నేపథ్యంలో ఈ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అధికారికంగా అమరావతేనని కేంద్రం కూడా గుర్తించింది. 
 
అదేసమయంలో అమరావతిలో రూ.6.69 కోట్ల వ్యయంతో జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (జీపీఏవో, కేంద్ర ఉద్యోగుల నివాసాలు) కోస భూమి కొనుగోలుకు కూడా కేంద్రం రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. దీని కోసం ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రూ.4.48 కోట్లను ఖర్చు చేయగా, ఈ ఆర్థిక బడ్జెట్‌లో రూ.లక్ష మాత్రమే కేటాయించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments