Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వరద బాధితులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2.91 కోట్ల విరాళం

అమరావతి : వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ వాసులకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2,91,43,466 విరాళం అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అసెంబ్లీలోని ఒకటో అంతస్తు కమిటీ హాలులో గురువార

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (15:00 IST)
అమరావతి : వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ వాసులకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2,91,43,466 విరాళం అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అసెంబ్లీలోని ఒకటో అంతస్తు కమిటీ హాలులో గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం తెలిపారు. 
 
వరదలతో కేరళ అతలాకుతలమైందన్నారు. ప్రాణ, ఆస్తినష్టం కలిగిందన్నారు. ఈ విషాదకర సమయంలో కేరళ వాసులకు అండగా ఉండాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సాయం అందించిందన్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు కూడా ఒక నెల వేతనంతో పాటు ఇతర అలెవెన్సులు విరాళం ఇవ్వాలని నిర్ణయించారన్నారు. 
 
శాసన సభ్యులు రూ.2,70,28,466, శాసన మండలి సభ్యులు రూ. 19,90,000, అసెంబ్లీ ఉద్యోగులు రూ.1,25,000 కలిపి మొత్తం రూ. 2,91,43,466 విరాళంగా అందజేయనున్నారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments