Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు తెలుగు హీరోలు భారీ విరాళం..!

గత కొన్ని రోజులుగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వారికి చేయూతను అందించేందుకు తన వంతు సాయంగా చిరంజీవి ఫ్యామిలీ 51 ల‌క్ష‌లు ఆర్ధిక సాయం అంద‌చేసారు. నాగార్జున 28 ల‌క్ష‌లు,

కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు తెలుగు హీరోలు భారీ విరాళం..!
, సోమవారం, 20 ఆగస్టు 2018 (14:38 IST)
గత కొన్ని రోజులుగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వారికి చేయూతను అందించేందుకు తన వంతు సాయంగా చిరంజీవి ఫ్యామిలీ 51 ల‌క్ష‌లు ఆర్ధిక సాయం అంద‌చేసారు. నాగార్జున 28 ల‌క్ష‌లు, మ‌హేష్‌ బాబు 25 ల‌క్ష‌లు, ప్రభాస్‌ కోటి రూపాయలు ప్రకటించారు. 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేర‌ళలోని వరద బాధితుల‌కు సాయంగా రూ.25 ల‌క్ష‌ల్ని ప్ర‌క‌టించగా ఆయన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కూడా 10 లక్షల రూపాయిలను ప్రకటించి తమ అభిమానులకు ప్రేరణగా నిలిచారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అంద‌చేయ‌నున్నారు.
 
మరోపక్క ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఏకంగా రూ.14 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై విజయ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే నిజమైతే... ఇప్పటివరకు విరాళాలు ఇచ్చిన ప్రముఖుల్లో అత్యధిక నగదు ప్రకటించిన నటుడు విజయ్‌నే అవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై 2 బ‌యోపిక్‌లు