Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరానికి రూ.1,850 కోట్లు... విత్తమంత్రి నిర్మల ఆదేశం

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (17:25 IST)
గతంలో పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉత్తర్వులిచ్చారు. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలని నాబార్డుకు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ సొమ్మును సెబీ(సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) పరిధిలో ఈ-ఆక్షన్‌ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా బాండ్లను జారీ చేసింది నాబార్డ్.. దాంతో రూ.1,850 కోట్లు రావడంతో ఆ మొత్తాన్నిత్వరలోనే పీపీఏకు పంపనుంది. పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయనుంది. 
 
కాగా గతేడాది జులైలో పోలవరానికి నిధులు మంజూరు చేసిన కేంద్రం.. ఆ తరువాత ఇదే ఇంత పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేయడం విశేషం. కాగా, పోలవరం పనులకు ఇటీవల రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రూ.841.33 కోట్లు ఆదా అయ్యాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments