Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు సీఎం జగన్.. చిన్న సర్ ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (19:30 IST)
తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. రేణిగుంట ఎయిర్ పోర్టులో సీఎంకు మంత్రులతో పాటు ఎమ్మెల్యే రోజా కూడా స్వాగతం పలికారు. తాజాగా ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్న సర్ ప్రైజ్ ఇచ్చారు. రోజా ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్టుని సీఎం కూడా ఆసక్తిగా తిలకించారు.
 
ఈ సందర్భంగా పట్టు శాలువాతో సీఎంను రోజా సత్కరించారు. ఐతే ఆ శాలువాను చూసి సీఎం జగన్ సర్ ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఆ శాలువాపై సీఎం జగన్ తో పాటు ఆయన తండ్రి,
Jagan_Roja
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ముద్రించి ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ రంగులు, ఫ్యాన్ గుర్తులు ఉండేలా శాలువాను రూపొందించారు.
 
శాలువాను సీఎం జగన్ ఆసక్తిగా గమనించారు. నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పం SV కోయిల్ వీధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సదుపాయాలతో పవర్ లూమింగ్ మిషన్ల యూనిట్ ను ఇటీవల రోజా ప్రారంభించారు. అక్కడి నేతన్నలు రూపొందించిన శాలువాలతో రోజా సీఎంను సత్కరించారు. 
roja_jagan
 
నగరిలో చేనేత యూనిట్ ను ప్రారంభించిన సందర్భంగా రోజా కాసేపు మగ్గంపై కూర్చొని చీరనేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రాలతో కూడిన చీరను రోజా నేశారు. అలాగే తన చిత్రంతో ఉన్న చీరను కూడా రోజా ప్రదర్శించి మురిసిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments