Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో మలయప్ప

స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో మలయప్ప
విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (12:26 IST)
తిరుమ‌ల‌లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో స్వామివారు క‌ల్యాణోత్స‌వ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామి కాళీయమర్ధనుడి అలంకారంలో స‌ర్వ‌భూపాల‌ వాహనంపై దర్శనమిచ్చారు. భ‌క్తుల‌కు క‌నువిందు చేశారు. 
 
 
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
 
 
వాహన సేవల‌లో పెద్ద జీయ‌ర్ స్వామి, చిన్న‌జీయ‌ర్ స్వామి, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ఎపి హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు ప్ర‌శాంతి రెడ్డి, పోకల అశోక్ కుమార్, ఎపి.నందకుమార్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమ‌వారం ఉదయం 9 గంటలకు మోహినీ అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరా స్పెషల్ : సాధారణ చార్జీలో వసూలు చేస్తామన్న ఎండీ సజ్జనార్