Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు పప్పుకు జోడీగా రాహుల్ పప్పు వచ్చి చేరారు-రోజా

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (15:02 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు పప్పు నారా లోకేష్‌కి తోడుగా రాహుల్ పప్పు వచ్చి చేరారని విమర్శించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును రోజా తప్పుబట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పని అయిపోయినట్టేనని రోజా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ.. ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన వీణ వాయించుకుంటూ కూర్చోవాలన్నారు. 
 
విపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం జరిగితే వెకిలి నవ్వులు నవ్వుతున్నారని రోజా మండిపడ్డారు. గత ఎన్నికల్లో తమ అధినేత జగన్మోహన్‌ని గెలవకుండా చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారన్నారు. ప్రజలను మోసం చేసి చంద్రబాబు గద్దెనెక్కారని రోజా ఆరోపించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదన్నారు. 
 
జగన్‌కు పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని రోజా ఆరోపించారు. పలు కేసులున్న క్రిమినల్‌ని ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో పెట్టుకున్నారని.. దాడి తర్వాత విపక్ష నేత జగన్‌పై టీడీపీ నేతలు ఎలా మాటల దాడి చేశారో ప్రజలు అందరూ చూశారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments