Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందుల వద్ద 30 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (10:53 IST)
కడప జిల్లాలోని పులివెందులలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థకు చెందిన పల్లెవెలుగు బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనానికి తప్పించే ప్రయత్నంలో భాగంగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
కదిరి నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు పులివెందుల సమీపంలోని డంపింగ్ యార్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో డ్రైవర్ బ్రేకులు వేశారు. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి చెట్లను ఢీకొట్టుతూ 30 అడుగుల లోతులో పడిపోయింది. క్షతగాత్రులను టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పరామర్శించారు. పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైద్యులకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అంటూ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Bigg Boss 8: ప్రేమపక్షులుగా మారిన విష్ణుప్రియ, పృథ్వీ..

ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్- హీరోయిన్ రేసులో వున్న సమంత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments