Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచంపై కూర్చొన్నవారిపైకి దూసుకెళ్లిన వ్యాను...

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (14:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని సీకే దిన్నె మండలంలో మద్దిముడుగులో ఈ ప్రమాదం జరిగింది. 
 
వేగంగా వెళుతున్న వ్యాను ఒకటి అదుపుతప్పి ఆరు బయట మంచంపై కూర్చొనివున్న నలుగురిపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మృతి చెందారు. కడప, బెంగుళూరు, జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామంలో కడప నుంచి రాయచోటికి వెళుతున్న జిప్సీ వ్యాన్ ఈ ప్రమాదానికి గురైంది. 
 
ఈ ప్రమాదంలో కొండయ్య, లక్ష్మీదేవి అనే ఇద్దరు సంఘటనలో మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ గాయపడిన ఇద్దరు యువతులైన అమ్ములు, దేవిని కడపలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, వీరిద్దరు కూడా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొండయ్య, అమ్ములు భార్యాభర్తలు కాగా, లక్ష్మీదేవి, దేవి వారి ఇంటి పక్కనే ఉండే కుటుంబ సభ్యులని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments