Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో ఆ పని చేయిస్తున్నారు.. ఆర్కే రోజా

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (11:39 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైకాపా నేత, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజాకు టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. 
 
సీఎం జగన్ సుపరిపాలనను ఓర్వలేక చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. యరపతినేని, కోడెల వంటి కీచకుల నుంచి విముక్తి పొందామని పల్నాడు ప్రజలు ఆనందంగా వున్నారని వెల్లడించారు. 
 
కోడెల, యరపతినేని, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, బోండా ఉమా బాధితుల కోసం చంద్రబాబు పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదని రోజా ప్రశ్నించారు. పల్నాడులో అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇకనైనా నాటకాలు ఆపకపోతే ప్రజలు తరిమికొడతారని చంద్రబాబుని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments