Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

సెల్వి
శనివారం, 9 నవంబరు 2024 (21:26 IST)
RK Roja
మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా కూటమి సర్కారుపై ఫైర్ అయ్యారు. ఏపీలో పరిపాలన చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా అనే సందేహం వస్తోందన్నారు. హిట్లర్, గడాఫీ ఇద్దరు కలిసి కూర్చుని పాలిస్తే ఎలా ఉంటుందో, అలా ఏపీలో పాలన సాగుతోందంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నియంత్రించలేక ఏపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఇంట్లోని వారే మహిళలా.. వైసీపీ నేతల ఇళ్లల్లో మహిళలు లేరా అని రోజా ప్రశ్నించారు. 
 
"పవన్ కళ్యాణ్‌కు ఆడవాళ్ల మీద గౌరవం లేదు. జనసేన, టీడీపీ వాళ్లు పెట్టే పోస్టులు ఆపలేరు. హీరో ప్రభాస్ మీద మెగాఫ్యాన్స్, జనసైనికులు పెట్టిన ఘోరమైన పోస్టులను తప్పని ఎప్పుడైనా ఆపించారా? వారిపై కేసులు పెట్టించారా? అల్లు అర్జున్ మీద, ఆయన కుటుంబం మీద పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా దిగజారుడుతనంగా పోస్టులు పెట్టింది. దానిని ఆపారా..? అంటూ ప్రశ్నించారు. ఇంకా హీరో ప్రభాస్, అల్లు అర్జున్ మీద పోస్టులు పెట్టిన వారిపైనా చర్యలు తీసుకోండి" అంటూ మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments