Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం .. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్లు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (09:14 IST)
అసలే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విభజన కారణంగా నవ్యాంధ్రకు రెవెన్యూ లోటు భారీగా ఏర్పడిన విషయం తెల్సిందే. దీన్ని భర్తీ చేసే చర్యల్లో భాగంగా ఈ నిధులను దశల వారీగా విడుదల చేస్తుంది. 
 
మొత్తం 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.7183 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నిధులతో కలుపుకుని ఇప్పటివరకు ఏపీకి మొత్తం రూ.7032 కోట్ల నిధులు రెవెన్యూ లోటు కింద వచ్చాయి. 
 
దేశంలో రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాల్లో ఏపీ, అస్సోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్‌తో సహా మొత్తం 14 రాష్ట్రాలు ఉన్నాయి. 
 
ఈ రాష్ట్రాల రెవెన్యూ లోటు కింద మంగళవారం కేంద్రం రూ.7183 కోట్లను విడుదల చేయగా, వీటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఖజానాకు రూ.1132 కోట్లు వచ్చి చేరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments