Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం .. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్లు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (09:14 IST)
అసలే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విభజన కారణంగా నవ్యాంధ్రకు రెవెన్యూ లోటు భారీగా ఏర్పడిన విషయం తెల్సిందే. దీన్ని భర్తీ చేసే చర్యల్లో భాగంగా ఈ నిధులను దశల వారీగా విడుదల చేస్తుంది. 
 
మొత్తం 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.7183 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ నిధులతో కలుపుకుని ఇప్పటివరకు ఏపీకి మొత్తం రూ.7032 కోట్ల నిధులు రెవెన్యూ లోటు కింద వచ్చాయి. 
 
దేశంలో రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాల్లో ఏపీ, అస్సోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్‌తో సహా మొత్తం 14 రాష్ట్రాలు ఉన్నాయి. 
 
ఈ రాష్ట్రాల రెవెన్యూ లోటు కింద మంగళవారం కేంద్రం రూ.7183 కోట్లను విడుదల చేయగా, వీటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఖజానాకు రూ.1132 కోట్లు వచ్చి చేరాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments