Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ప్రోత్సాహంతోనే జగన్.. : హమ్మ రేవంత్‌రెడ్డి ఎంత మాటనేశాడు?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (19:12 IST)
కేసీఆర్ ప్రోత్సాహంతోనే సీఎం జగన్ చెలరేగిపోతున్నారని, ఏపీ నిర్మిస్తోన్న ప్రాజెక్టుల్లో కేసీఆర్‌కు కమీషన్లు వస్తున్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

తెలంగాణకు కాపలాగా ఉండాల్సిన కేసీఆర్ దొంగగా మారారని ధ్వజమెత్తారు. అపెక్స్ కౌన్సిల్ అజెండాలో జీవో 69ను చేర్చకపోతే కోర్టుకెళ్తామని ప్రకటించారు.

ప్రైవేట్ విద్యుత్ సంస్థల వద్ద అధిక ధరకు విద్యుత్‌ను కొనడానికి.. కేసీఆర్‌ ప్రణాళికలు రచించారని, కమీషన్లకు కక్కుర్తిపడి దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని దుయ్యబట్టారు.

మెగా కృష్ణారెడ్డి కోసమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని 20వ తేదీ తర్వాత నిర్వహించాలని కేసీఆర్ కోరారని రేవంత్‌రెడ్డి చెప్పారు. 
 
అంతకుముందు కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌ను రేవంత్‌రెడ్డి కలిశారు. నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని కోరారు. ఈ నెల 25న అపెక్స్ కమిటీ సమావేశం అజెండాలో చేర్చాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

2014లోనే అనుమతులు, రూ.1450 కోట్లు కేటాయింపు కూడా జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు ఊసే లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments