Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ప్రోత్సాహంతోనే జగన్.. : హమ్మ రేవంత్‌రెడ్డి ఎంత మాటనేశాడు?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (19:12 IST)
కేసీఆర్ ప్రోత్సాహంతోనే సీఎం జగన్ చెలరేగిపోతున్నారని, ఏపీ నిర్మిస్తోన్న ప్రాజెక్టుల్లో కేసీఆర్‌కు కమీషన్లు వస్తున్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

తెలంగాణకు కాపలాగా ఉండాల్సిన కేసీఆర్ దొంగగా మారారని ధ్వజమెత్తారు. అపెక్స్ కౌన్సిల్ అజెండాలో జీవో 69ను చేర్చకపోతే కోర్టుకెళ్తామని ప్రకటించారు.

ప్రైవేట్ విద్యుత్ సంస్థల వద్ద అధిక ధరకు విద్యుత్‌ను కొనడానికి.. కేసీఆర్‌ ప్రణాళికలు రచించారని, కమీషన్లకు కక్కుర్తిపడి దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని దుయ్యబట్టారు.

మెగా కృష్ణారెడ్డి కోసమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని 20వ తేదీ తర్వాత నిర్వహించాలని కేసీఆర్ కోరారని రేవంత్‌రెడ్డి చెప్పారు. 
 
అంతకుముందు కృష్ణా రివర్ బోర్డు చైర్మన్‌ను రేవంత్‌రెడ్డి కలిశారు. నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని కోరారు. ఈ నెల 25న అపెక్స్ కమిటీ సమావేశం అజెండాలో చేర్చాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

2014లోనే అనుమతులు, రూ.1450 కోట్లు కేటాయింపు కూడా జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు ఊసే లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments